కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్‌లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్‌లోని రెడ్‌వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నరాన్న సమాచారం అందుకున్న భద్రతా దళాలు సోమవారం అర్ధరాత్రి వారి కోసం గాలింపు ప్రారంభించారు. ఈ గాలింపులో ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన భద్రతా దళాలు వారిపై కాల్పులు జరిపి ముగ్గురిని మట్టుబెట్టారు. ప్రస్తుతం అక్కడ గాలింపు కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️