అండగా ఉంటాం.. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన భువనేశ్వరి

Jan 31,2024 21:26 #nara bhuvaneswari, #paramarsa

ప్రజాశక్తి-దర్శి (ప్రకాశం జిల్లా) :టిడిపి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. దర్శి నియోజకవర్గంలో దర్శి, ముండ్లమూరు మండలాల్లో సింగన్నపాలెం, తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామాల్లో ఆమె బుధవారం పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.మూడు లక్షల చెక్కును అందించారు. దర్శిలోని ఐదో వార్డులో తురిమెళ్ల పరిశుధ్దరావు కుటుంబానికి, ముండ్లమూరు మండలం సింగన్నపాలెం గ్రామంలోని పార్టీ కార్యకర్త బత్తిన హనుమంతరావు కుటుంబానికి, తాళ్లూరు మండలం తూర్పుగంగవరం గ్రామంలో జంపాల నరసింహారావు కుటుంబానికి చెక్కును అందజేశారు. భువనేశ్వరి వెంట ఎమ్మెల్సీ అనురాధ, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ ఉన్నారు.

➡️