మహబూబాబాద్ : అర్హులందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్ పట్టణంలోని సీపీఎం జిల్లా కార్యాలయం నుంచి మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం తహశీల్దార్కు వినతి పత్రం సమర్పించారు.ప్రభుత్వం ఇండ్లులేని నిరుపేదలను గుర్తించి తక్షణమే ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సుంకరి వీరయ్య, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి నాగయ్య, జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.