ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే చంద్రబాబు ఆలోచన : నారా భువనేశ్వరి

Feb 9,2024 15:10 #nara bhuvaneswari, #paramarsa

నందిగామ: టిడిపి అధినేత చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించేనని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం కోనాయపాలెంలో ఆమె పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మఅతి చెందిన వనపర్తి మల్లికార్జున కుటుంబసభ్యులను పరామర్శించారు. మల్లికార్జున చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. టిడిపి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మఅతి చెందిన వారిలో ఇప్పటివరకు 60 కుటుంబాలను పరామర్శించానని భువనేశ్వరి తెలిపారు. ఇంకా 160 కుటుంబాలను పరామర్శించాల్సి ఉందని చెప్పారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ పరామర్శించి ధైర్యం చెప్పాలని తనతో అన్నారని గుర్తుచేశారు. అందుకే ‘నిజం గెలవాలి’ చేపట్టానన్నారు. రానున్న 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరుగుతుందని.. తప్పకుండా మనమే గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

➡️