ఎర్రగుట్టలో గుడిసెల తొలగింపు అన్యాయం- సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన

Feb 28,2024 08:42 #CPM State Committee, #prakatana

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రేణిగుండ కరకంబాడి ఎర్రగుట్టపై ఐదువేల గుడిసెలను బలవంతంగా తొలగించి, అడ్డుకున్న వారిపై లాఠీఛార్జి చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేసి, పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వాలని కోరారు. ఒకవైపు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్న వైసిపి ప్రభుత్వం, మరోవైపు పేదలు వేసుకుంటున్న గుడిసెలను తొలగిస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

➡️