అమరావతి: రాష్ట్రంలో బిజెపి పోటీ చేసే పది అసెంబ్లీ స్థానాలు దాదాపుగా ఖరారయ్యాయి. విశాఖ నార్త్, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, బద్వేలు, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ పోటీ చేయనుంది. చివరి నిమిషంలో ఒకటి, రెండు స్థానాల్లో మార్పులు జరిగేందుకు అవకాశం ఉంది. విశాఖ నార్త్ నుంచి సీనియర్ నేత విష్ణుకుమార్రాజుతో పాటు మరొకరి పేరు, కైకలూరు నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమువీర్రాజు, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నుంచి సురేష్, ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ), ఆదోని నుంచి కర్నూలు జిల్లా బిజెపి అధ్యక్షుడు కొనిగిరి నీలకంఠం, శ్రీకాకుళం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.సురేంద్రమోహన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.