కాంగ్రెస్‌ వచ్చాక ఇన్వెటర్లు, జనరేటర్లకి డిమాండ్‌ పెరిగింది : హరీశ్‌రావు

Feb 4,2024 15:05 #Harish Rao, #speech

సంగారెడ్డి : ఎన్నికల్లో రకరకాల హామీలతో కాంగ్రెస్‌ ప్రజలను మభ్యపెట్టింది. గ్లోబెల్స్‌ ప్రచారం చేసి గెలిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. ఆదివారం పటాన్‌చెరులో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ మెదక్‌ పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గని మాట్లాడారు. మేం గెలిచాక 15 వేల రైతబంధు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట తప్పిందన్నారు.వడ్లకు బోనస్‌, వృద్ధాప్య పెన్షన్‌ పెంపు, 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ప్రచారం చేశారు. ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టింది. 12 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అడిగితే తొందరెందుకు అంటున్నారని మండిపడ్డారు.కేసీఆర్‌ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్‌ ఇస్తే ఇప్పుడు 15 నుంచి 16 గంటల కరెంటు వస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ వచ్చాక ఇన్వెటర్లు, జనరేటర్లకి డిమాండ్‌ పెరిగిందని తెలిపారు.నిరుద్యోగులకు ఫిబ్రవరి 1న గ్రూప్స్‌ నోటిఫికేషన్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. రాముడు అందరి వాడని, రాజకీయంగా వాడుకొని ఓట్లు అడుగుతామంటే ఎవరు వెయరన్నారు. ఏం చేశారో చెప్పుకోవడానికి ఏం లేక దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్నారని బీజీపై మండిపడ్డారు. కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిపోయాం. కలిసి పని చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదేనని స్పష్టం చేశారు.

➡️