చిన్నారి లక్షితపై దాడి చేసి చంపిన చిరుత గుర్తింపు

ప్రజాశక్తి-తిరుమల : అలిపిరి కాలినడక మార్గంలో గత ఏడాది ఆగస్టు 12న చిరుత దాడిలో చిన్నారి లక్షిత మతి చెందిన విషయం తెలిసిందే. చిన్నారి లక్షితపై దాడి చేసి చంపిన చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు. టిటిడి బంధించిన నాలుగో చిరుతగా దీన్ని నిర్ధారించారు. జూపార్కులోనే దీనిని సంరక్షించాలని టిటిడి నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

➡️