తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

తిరుపతి : తిరుమలలో బుధవారం యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వెంకన్న సర్వ దర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో యాత్రికులు వేచి ఉన్నారు. మంగళవారం శ్రీవారిని 60,110 మంది యాత్రికులు దర్శించుకోగా 21,445 మంది యాత్రికులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.43 కోట్లు ఉందని టిటిడి అధికారులు ప్రకటించారు.

➡️