తిరుమలలో యాత్రికులరద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి యాత్రికులతో నాలుగు కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు. మంగళశారం స్వామివారిని 64, 345 మంది యాత్రికులు దర్శించుకోగా 20,788 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.71 కోట్లు వచ్చిందని తెలిపారు.

➡️