తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ సాధారణంగా ఉంది . కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు దేశంలోని యాత్రికులే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా యాత్రికులు స్వామివారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు. సర్వదర్శనం కోసం 10 కంపార్టుమెంట్‌లల్లో యాత్రికులు వేచి యున్నారు.టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శనివారం స్వామివారిని 76,041 మంది యాత్రికులు దర్శించుకోగా 28,336 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికుల కానుకల వల్ల టీటీడీ హుండీకి రూ. 3.06కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు.

➡️