తిరుమలలో హుండీ ఆదాయం రూ.3.44 కోట్లు

తిరుమల : తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న యాత్రికుల సంఖ్య తగ్గింది. రెండు కంపార్టుమెంట్లలలో మాత్రమే యాత్రికులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.మంగళవారం స్వామివారిని 63,665 మంది యాత్రికులు దర్శించుకోగా 18,630 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.44 కోట్లు వచ్చిందని వివరించారు.

➡️