చిట్యాల టౌన్ :నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎంపీఎల్ కంపెనీ విస్తరణ పై శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ ఉంది. దానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా గ్రామ యువకులు, అఖిల పక్ష పార్టీల నాయకులు అడ్డుకున్నారు. అదే విధంగా అక్కడే గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.