ప్రజాశక్తి-ఖమ్మం: భారీ విజయాన్ని సాధించిన అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తానన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. మధిర కాంగ్రెస్ అభ్యర్థి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 35,190 ఓట్లతో విజయం సాధించారు. తెలంగాణలో దొరల పాలన పోయిందని.. ప్రజల తెలంగాణ పాలన వచ్చిందన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/batti.jpg)