- – ఇద్దరు పైలెట్లు సజీవ దహనం
- – పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : శిక్షణలో ఉన్న హెలికాప్టర్ సాంకేతిక లోపంతో కూలిపోవడంతో ఇద్దరు పైలెట్లు సజీవ దహనమైన సంఘటన తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాల్టీ పరిధిలోని రావెల్లి గ్రామ శివారులో సోమవారం జరిగింది. ఎయిర్ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని దుందిగల్ ఎయిర్ఫోర్స్ నుంచి శిక్షణ నిమిత్తం బయలుదేరిన హెలిక్యాప్టర్లో రావెల్లి గ్రామ శివారులో సాంకేతిక లోపం ఏర్పడింది. టాటా కాఫీ పరిశ్రమ సమీపంలోని రాళ్ల గుట్టల్లో ఇది కూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో హెలికాప్టర్ పూర్తిగా కాలి బూడిదైంది. ఇద్దరు పైలెట్లు అక్కడికక్కడే మృతిచెందారు. వారు వియత్నాంకు చెందిన అభిమన్యూరారు, ఇతర దేశానికి చెందిన ఉవాన్టైమ్గా గుర్తించారు. ఎయిర్ఫోర్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఫైర్ ఇంజన్ల ద్వారా అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలాన్ని ఎయిర్ఫోర్స్ అధికారులు అధీనంలోకి తీసుకుని ప్రమాద వివరాలను సేకరించారు.