సాగర్‌ నుంచి ఎపికి 3 టిఎంసిలు: కెఆర్‌ఎంబి

Mar 1,2024 08:48 #3, #AP, #KRMB, #Nagarjuna Sagar, #TMC

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మూడు టిఎంసిల నీటిని విడుదల చేయనున్నారు. ఈమేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) అనుమతినిచ్చింది. సాగర్‌ కుడికాల్వ హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా శుక్రవారం ఉదయం 11 గంటలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించింది. కెఆర్‌ఎంబి అధికారుల సమక్షంలో నీటి విడుదల జరుగుతుందని ఉత్తర్వుల్లో బోర్డు పేర్కొంది.

➡️