యువగళం ముగింపు సభకు 5 ప్రత్యేక రైళ్లు : అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : యువగళం ముగింపు సభకు ఐదు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర ప్రజల మద్దతుతో విజయవంతమైందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20న విజయనగరం జిల్లా పోలిపల్లిలో ముగింపు సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సభకు హాజరయ్యేందుకు ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 5 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ రైళ్లు 19న ఆయా ప్రాంతాల నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. చిత్తూరు నుంచి ఉదయం 11 గంటలకు, తిరుపతి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు, రైల్వే కోడూరు నుంచి ఉదయం 7 గంటలకు, ధర్మవరం నుంచి ఉదయం 7 గంటలకు, నెల్లూరు నుంచి రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయని వివరించారు.

➡️