ఎపి పోలీసులపై నాగార్జునసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

తెలంగాణ : ఎపి పోలీసులపై తెలంగాణ ఎస్పీఎఫ్‌ పోలీసులు చేసిన ఫిర్యాదు మేరకు నాగార్జునసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. ఎపి పోలీసులు ఎలాంటి అనుమతి లేకుండా డ్యామ్‌పైకి వచ్చారని.. నిన్న అర్ధరాత్రి సీసీ కెమెరాలనను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎపి పోలీసులుతోపాటు ఇరిగేషన్‌ అధికారులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈరోజు రెండు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు సాగర్‌ వద్దకు చేరుకొని పరిస్థితిని అంచనా వేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే సుమారు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని ఎపి విడుదల చేసుకున్న సంగతి తెలిసిందే.

నాగార్జునసాగర్‌ డ్యాంపై ఉద్రిక్తత

➡️