చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

Jan 4,2024 15:30 #died, #fishermen

వరంగల్‌ : చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన విషాకర సంఘటన వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మత్స్యకారుడు బెజ్జం వెంకటనరసయ్య గురువారం తెల్లవారుజామున గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులో చేపలు పట్టడానికి దిగాడు. వల వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాళ్లకు వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. వెంకటనరసయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

➡️