ఎలక్షన్‌ ట్రైనింగ్‌ లో వడదెబ్బతో ఉపాధ్యాయుడు మృతి

May 4,2024 18:02 #Election Training, #teacher died

హుస్నాబాద్‌ రూరల్‌ :పార్లమెంట్‌ ఎలక్షన్‌ ట్రైనింగ్‌ లో వడదెబ్బ తగిలి లకావత్‌ రామన్న (45) ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుస్నాబాద్‌ మండలంలోని బల్లు నాయక్‌ తండకు చెందిన లకావత రామన్న అక్కన్న పేట మండలంలో ని యాటకర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్‌ జి టి గా పనిచేస్తున్నాడు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్‌ లో ఎలక్షన్‌ విధులకు వెళ్లాడు. శుక్రవారం అధికారులకు ఏర్పాటుచేసిన శిక్షణ సమయంలో వడదెబ్బ తగిలింది. ఎలక్షన్‌ డ్యూటీ లో ఉన్న ఎలక్షన్స్‌ సిబ్బందే గజ్వేల్‌ పిహెచ్‌ సి ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. ప్రథమ చికిత్స చేసుకుని హాస్పిటల్‌ నుండి ఇంటికి వచ్చాడు .రాత్రి పరిస్థితి విషమించడంతో వరంగల్‌ ఎంజీఎం కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మి, కూతురు శ్రుతి, కుమారుడు అశ్రుత్‌ ఉన్నారు.

➡️