పెళ్లింట తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి.. 20 మందికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌ : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం ప్రయాణిస్తోన్న ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని ఆందోల్‌ మండలం మన్సాన్‌పల్లి గ్రామ శివారులో బుధవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️