మరో ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థుల ప్రకటన

Mar 13,2024 21:06 #candidates, #KCR, #MP, #reveals

హైదరాబాద్‌: రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. చేవెళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌, వరంగల్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యలను ప్రకటించారు. ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థులను ప్రకటించించారు. తాజాగా ఇద్దరు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఆరుకు చేరింది. ఇంకా 11 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ ప్రకటించాల్సి ఉంది.

➡️