AP: ముగ్గురు ఐఎఎస్‌లు బదిలీ.. జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం

Jun 29,2024 11:43 #ap government, #IAS, #transfers

ప్రజాశక్తి-అమరావతి : ఎపిలో ముగ్గురు ఐఎఎస్‌లు బదిలీ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని జీఏడీలో రిపోర్టు చేయాలని పేర్కొంది. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఓఎస్డీ బి.అనిల్‌ కుమార్‌ రెడ్డి, ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఇన్కాప్‌ ఎండీ నీలకంఠారెడ్డి, సంప్రదాయేతర ఇంధన వనరులు కార్పొరేషన్‌ ఎండీ నంద కిషోర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ముగ్గురిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

➡️