ప్రజాశక్తి-అమరావతి: 897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 25న రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబందించిన ప్రాథమిక కీ విడుదలైంది. ఈ ప్రాథమిక కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలని తెలిపింది. పోస్టు/వాట్సప్/ఎస్ఎంఎస్/ఫోన్/వ్యక్తిగతంగా సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోబోమని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది.