హైదరాబాద్ : తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. యువతిపై తాపీ మేస్త్రీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇస్నాపూర్లో పెద్దిరాజు అనే ఓ వ్యక్తి తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. తన వద్దకు కూలీ పనికి వచ్చే ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళ కూతురిపైనా కన్నేశాడు. ఇటీవల ఇంట్లో తల్లిలేని సమయం చూసి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెసుకున్న తల్లి.. పటాన్ చెరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పెద్దిరాజుపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![Rajastha 8-year-old schoolgirl gang-raped by driver, his f](https://prajasakti.com/wp-content/uploads/2023/12/Rajastha-8-year-old-schoolgirl-gang-raped-by-driver-his-f-.jpg)