కెఆర్‌ఎంబి చైర్మన్‌గా అతుల్‌జైన్‌

Jun 29,2024 20:53 #ACB DG, #Atul Singh

ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో :కృష్ణా నది యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) చైర్మన్‌గా కేంద్ర జల సంఘం ఉన్నతాధికారి అతుల్‌జైన్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అనిల్‌కుమార్‌ శర్మ ఆదేశాలు జారీ చేశారు. డిఒపిటి ఆదేశాల మేరకు సెంట్రల్‌ వాటర్‌ ఇంజినీరింగ్‌ (గ్రేడ్‌ ఏ) సర్వీసులో ఉన్న అతుల్‌జైన్‌ను ప్రస్తుతం పూర్తిస్థాయి చైర్మన్‌గా నియమించారు. గతంలో తాత్కాలిక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. సర్వీసు విషయంలో ఇటీవల ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం మరోసారి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. జులై ఒకటి నుంచి తాజా ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నది.

➡️