మే డేను జయప్రదం చేయండి : సిఐటియు

Apr 30,2024 21:49 #CITU, #May Day

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కార్మికవర్గ అంతర్జాతీయ దినోత్సవం మే డేను జయప్రదం చేయాలని, ప్రపంచ కార్మికుల ఐక్యతను పెంపొందించేందుకు, కార్మిక హక్కులను కాపాడుకునేందుకు, శ్రమ దోపిడీని నిర్మూలించి సమ సమాజాన్ని స్థాపించుకునేందుకు ప్రతినపూనే రోజే మే డే అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. మే డే దినోత్సవం ఇతర పండగలలా కాకుండా కులం, మతం, ప్రాంతం, దేశం తదితర హద్దులతో సంబంధం లేకుండా చైతన్యవంతంతో నిర్వహించుకునే రోజు అని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని కేంద్రాలు, పారిశ్రామిక ప్రాంతాలు, కార్యాలయాలు తదితర ప్రాంతాల వద్ద జెండాలు ఎగురవేసి ఈ మే డేను నిర్వహించాలని కోరారు. కార్మికుల హక్కులపై జరుగుతున్న దాడులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

➡️