హైదరాబాద్: సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. గురువారం రాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్రూంలో జారిపడటంతో కేసీఆర్ ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే ఉంటూ కోలుకుంటున్నారు.