13న అదనపు బస్సులను పెంచండి : ఎపిఎస్‌ఆర్‌టిసి ఎండి కి చంద్రబాబు లేఖ

అమరావతి : ఈనెల 13వ తేదీన పోలింగ్‌ కు వచ్చేవారి కోసం అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని కోరుతూ … ఎపిఎస్‌ఆర్‌టిసి ఎండి కి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆర్టీసీ బస్సులను పెంచడం ద్వారా ప్రయాణ సౌకర్యంతో ఓటింగ్‌ శాతం పెరుగుతుందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

లేఖలోని అంశాలు :

  • 13వ తేదీన ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఉన్న ఎపి ఓటర్లు ఓటు వేసేందుకు సొంత ప్రాంతాలకు వస్తారు.
  • ఇప్పటికే హైదరాబాద్‌ తో పాటు ఇతర ప్రాంతాల నుండి ఓటు వేసేందుకు ఎపిలోని తమ ఊళ్లకు ప్రజలు ప్రయాణమవుతున్నారు.
  • ఇలాంటి సమయంలో సొంత ప్రాంతానికి వెళ్లడానికి ఆర్టీసీ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • ఇప్పటికే హైదరాబాద్‌, విజయవాడ బస్టాండ్‌ లలో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది.
  • అవసరమైనన్ని బస్సులు అందుబాటులో లేక సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్‌ స్టేషన్లలో నిరీక్షిస్తున్నారు.
  • ఈ రెండు, మూడు రోజులు అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణ సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేయాలి.
  • రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం వల్ల ఓటింగ్‌ శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది.
➡️