15న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సిఎం పర్యటన

Feb 14,2024 11:10 #15, #cm, #Guntur District, #Kurnool, #Visit

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. మొదట ఉదయం 9:30కు కర్నూలు నగరానికి చేరుకుంటారు. అక్కడ బళ్లారి చౌరస్తాలోని కళ్యాణ మండపంలో ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నానికి తాడేపల్లికి చేరుకుంటారు. తిరిగి 2:40 గంటలకు గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి వెళ్తారు. ఫిరంగిపురంలో జరిగే వలంటీర్ల అభినందన సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

➡️