ఎమ్మెల్సీ సాబ్జీ మృతికి సీపీఎం సంతాపం

cpm condolence to mlc sabji

ప్రజాశక్తి-అరకువాలీ : ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఉద్యమ ప్రముఖ రాష్ట్ర నాయకులు షేక్‌ సాబ్జీ దుర్మరణం పట్ల అరకువాలీలో జరుగుతున్న సీపీఎం అల్లూరి జిల్లా ప్లీనం సందర్బంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విశ్రీనివాసరావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులార్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాధం, సురేంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనరస, సీపీఎం అనంతగిరి జడ్పీటీసీ గంగరాజు, నాయకులు పడల్, ఉమామహేశ్వరవు, సీపీఎం జిల్లా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️