ప్రజాశక్తి-విజయవాడ : తాడేపల్లి సిట్ కార్యాలయంలో పత్రాలు తగలబెట్టిన ఘటనపై ఎన్నికల కమిషన్ సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు వెల్లడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఎన్నికల కమిషన్ను ఒక ప్రకటనలో కోరారు. పత్రాలు తగలబెట్టిన ఘటనపై సీఐడీ వివరణ అనుమానాలకు తావిస్తోందని.. తక్షణమే విచారణ చేసి వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.