తాడేపల్లిలో డ్రగ్స్‌ కలకలం

May 4,2024 10:07 #Drugs, #Tadepalli

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్‌ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకోగా.. ఎస్‌ఈబీ అధికారులు గోప్యంగా ఉంచారు. ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అధికారులు నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించనున్నారు.

➡️