అమరావతి : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ … ఎపి రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పై టిడిపి సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు చేస్తోందని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా జగన్ వ్యక్తిత్వంపై దాడి చేసే విధంగా ప్రచారం చేస్తోందని ఫిర్యాదులో ఆరోపించారు. అప్పిరెడ్డి ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి టిడిపి అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. దీంతో 24 గంటల్లోగా అసభ్యకర పోస్టులను తొలగించాలని సీఈవో ఆదేశించారు.