ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసరు పోస్టులకు జూన్ 10, 11, 12 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధి, శిక్షణశాఖ డైరెక్టరు బి నవ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ జూన్ 6 నుంచి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే జూనియర్ ఇంజినీరింగ్ పరీక్షలు కూడా అదే తేదీల్లో ఉండటంతో రాత పరీక్షల తేదీలు మార్పు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ పోస్టులకు మార్చి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఈ పరీక్షల తేదీ మార్పును గమనించాలని కోరారు. పూర్తి వివరాలను వెబ్సైట్ https//employment.ap.gov.inలో తెలుసుకోవచ్చని సూచించారు.