ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఈ నెల 13న జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగే ఒక్కరోజు హైకోర్టుకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నందున హైకోర్టుతోపాటు పరిపాలనా పరిధిలో పనిచేస్తున్న కార్యాలయాల అధికారులు, సిబ్బందికి సెలవుగా ప్రకటిస్తున్నామని తెలిపారు. హైకోర్టు పాలనా పరిధిలో ఎపి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఎపి జ్యుడీషియల్ అకాడమీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, హైకోర్టు మీడియేషన్, ఆర్భిట్రేషన్ సెంటర్లకు సెలవు దినంగా ప్రకటించినట్లు లక్ష్మణరావు పేర్కొన్నారు.