ప్రజాశక్తి-తిరుపతి: తిరుపతిలో వైసిపి ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నేడు మిథున్ రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనకు వెళితే గోడవలు జరిగే అవకాశం ఉందనే ముందస్తూ సమాచారంతో మిధున్ రెడ్డి పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ తరుణంలోనే ఇవాళ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హౌజ్ అరెస్ట్ అయ్యారు. మిధున్ రెడ్డి హౌస్ అరెస్టు అయిన నేపధ్యంలో వందలాది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. చిన్న గొడవ జరిగిన కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు భారీ సంఖ్యలో వైసిపి అభిమానులు మిథున్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు.