ప్రజాశక్తి – కాకినాడ:కాకినాడలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్నకుమార్ కోరారు. నగరంలోని అంబేద్కర్ భవన్ వద్ద ఆదివారం రాష్ట్ర మహాసభ పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విద్యారంగంలో ఉన్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమాలను రూపొందించుకోవడం కోసం ఈ మహాసభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణ్రావు, ఇళ్ల వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ విఠలపు బాలసుబ్రహ్మణ్యం హాజరవుతారని తెలిపారు. ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగాసూరిబాబు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు టి రాజా, జిల్లా అధ్యక్షులు వరహాలు తదితరులు పాల్గొన్నారు.