ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి అధినేత చంద్రబాబును పలు ముస్లిం సంఘాల నేతలు కలిసి మద్దతు తెలిపారు. సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, ఎపి ఉలేమా ఆర్గనైజేషన్ నిర్వాహకులు, మౌలానా నయీం ఉర్ రెహ్మాన్ఖాన్ రషాద్మి, ఆంధ్ర, తెలంగాణ జమియత్ ఉలేమ్మా ఎ హింద్, ముస్లిం మైనార్టీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు విడివిడిగా చంద్రబాబును హైదరాబాద్లోని ఆయన నివాసంలో బుధవారం కలిశారు. ఐక్య కార్యాచరణ సమితి ముద్రించిన ‘అమరావతితో ముడిపడి ఉన్న ముస్లిముల భవిష్యత్తు’, ‘జగన్ నిజస్వరూపం’ అనే కరపత్రాలను చంద్రబాబు ఈ సందర్భంగా ఆవిష్కరించారు.