సిపిఎంకు ఓటేసి గెలిపిద్దాం : విశాఖ గిరిజనులు

Apr 26,2024 09:57 #cpm, #Visakha tribals, #vote

విశాఖ : పార్లమెంటరీ అభ్యర్థి పి.అప్పల నరసయ్యను అని గెలిపించాలని కోరుతూ …. సిపిఎం ఆధ్వర్యంలో అనంతగిరి మండలం పినకోట పంచాయతీ కొట్టెంకూడా, గొప్పలపాలెం, గుమ్మపంచాయతీ కళ్యాణగుమ్మి గ్రామాల్లో గిరిజనులు శుక్రవారం విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం లేదని… డోలి కట్టుకొని 15 కిలోమీటర్లు నడిస్తే ఎలమంచి వస్తుందని తెలిపారు. జిరాయితి భూమి పట్టాలు – మావాసులకు మార్చాలి కాని నేటికి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ అధికారులు పట్టాలు మార్పు చేయటం లేదని అన్నారు. ఇలాంటి సమస్యలపై నికరంగా పోరాడుతున్న సిపిఎంకు ఓటు వేసి గెలిపించాలని రాపా బాలరాజు, నందులు, బాలరాజు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

➡️