Margani Bharat: వైసిపి మాజీ ఎంపీ ప్రచార రథాన్ని తగలబెట్టారు

Jun 29,2024 08:56 #Attacks, #fire, #ycp mp

రాజమహేంద్రవరం  : రాజమహేంద్రవరం నగరంలోని వైఎస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్‌ కార్యాలయంలో ఆయన ప్రచార రథాన్ని అగంతకులు తగులబెట్టారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి 11.45 గంటల ప్రాంతంలో జరిగింది.  అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనలో ప్రచార వాహనంగా రూపొందించిన కారు పూర్తిగా దగ్ధమైంది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి భరత్ ఈ వాహనాన్ని ఉపయోగించారు. అధికారిక ప్రకటనలో భరత్ తన ప్రచార వాహనానికి కొంతమంది దుర్మార్గులు నిప్పుపెట్టారని ఆరోపించారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ ద్వారాక తిరుమలరావు దృ ష్టికి తీసుకుని వెళ్లి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతామని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు.

➡️