ప్రజాశక్తి-దర్శి : దర్శి నియోజకవర్గం, దర్శి మండలం, రాజంపల్లి గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్దిదారులకు ఫించన్ నగదును రాష్ట్రా సాంఘిక సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ, సచివాలయం, గ్రామ వాలంటీర్ శాఖ మంత్రివర్యులు డోలా బాలవీరాంజనేయస్వామి, జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా అందచేశారు. అవ్వా తాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పింఛన్ సొమ్ముతో పాటు ముఖ్యమంత్రి లేఖ, రసీదును సచివాలయ సిబ్బంది అందజేస్తున్నారు. నూతన పింఛన్ రూ. 4 వేలు, పెరిగిన బకాయిలు రూ.3 వేలు కలిపి మొత్తం రూ. 7 వేలు అందజేయడంతో ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి కాకుండానే హామీలు అమలు చేయడంతో పేద ప్రజల ఆనందం వెల్లి విరుస్తున్నది. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం ఇన్చార్జి డా. గొట్టిపాటి లక్ష్మి, కనిగిరి ఆర్ డి ఓ శ్రీ జాన్ ఇర్విన్, డి ఆర్ డి ఎ పిడి శ్రీమతి వసుంధర తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/Minister-Bala-in-NTR-Bharosa-programme.jpg)