మిచౌంగ్‌ తుఫాన్‌ .. విరిగిపడిన కొండచరియలు..

Dec 5,2023 19:03 #Tufan
  • కేకే లైన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌..

ప్రజాశక్తి- అల్లూరి సీతారామరాజు జిల్లా : మిచౌంగ్‌ తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సష్టిస్తోంది.. ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది.. ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ రైలు మార్గంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. కొత్తవలస కిరండోల్‌ రైలు మార్గంలో కొండచరియలు విరిగిడ్డంతో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. శివలింగపురం యార్డ్‌ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.. దీంతో, కేకే లైన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.. అరకులోనే కిరండోల్‌ – విశాఖ ప్యాసింజర్‌ రైలును అధికారులు నిలిపివేశారు.. ప్రయాణికులను ఆర్టీసీ బస్సులలో గమ్యస్థానాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

➡️