AP CM: పింఛన్ దారులకు సిఎం చంద్రబాబు బహిరంగ లేఖ

Jun 29,2024 10:01 #CM Chandrababu, #Letter to, #Pensioners

ప్రజాశక్తి-అమరావతి: పింఛన్ దారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ”ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం – మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది – ఏ ఆశలు, ఆకాంక్షలతో గెలిపించారో.. వాటిని నెరవేర్చడమే తక్షణ కర్తవ్యం – మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం – దివ్యాంగులకు పింఛన్ రూ.6 వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది – జులై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తున్నాం – ఆర్థిక సమస్యలున్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు – పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం – నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది – ఎన్నికల సమయంలో 3 నెలలు మీ కష్టాలు చూసి చలించిపోయా – మండుటెండలో, వడగాడ్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూశా – ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తానని మాట ఇచ్చా – ఏప్రిల్, మే, జూన్ నెలలకూ పెంపును వర్తింపచేసి మీకు అందిస్తున్నా – మూడు నెలలకు పెంచిన రూ.3 వేలు, జులై రూ.4 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు – పింఛన్ విధానానికి ఆద్యుడైన ఎన్టీఆర్ పేరును పింఛన్ల కార్యక్రమానికి పెట్టాంఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్ద సామాజిక పింఛన్ల పంపిణీ – ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని” సిఎం చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

➡️