ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైద్య విద్యా కోర్సులకు సంబంధించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)కు రాష్ట్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 29 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరి, అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూటీ, గూడూరు, కడప, కాకినాడ, నంద్యాల, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, సూరంపాలెం (తూర్పుగోదావరి), తాడేపల్లిగూడెం, తణుకు, విజయనగరంలో నీట్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు నిర్ధేశించిన సమయానికి చేరుకోవాలని అధికారులు కోరారు.