ప్రజాశక్తి – సీతమ్మధార (విశాఖపట్నం) : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైనా, వైసిపి ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె.రాజుపైనా గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బిజెపి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పి.విష్ణుకుమార్ రాజుకు పోలీసులు సోమవారం 41 నోటీసు అందజేశారు. సిఎంను దుర్మార్గపు ముఖ్యమంత్రి అని, కెకె.రాజును రౌడీ రాజు అని సంబోధిస్తూ విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు అందిన నేపథ్యంలో పోలీసులు తాజాగా నోటీసు అందజేసి విచారణ చేపట్టారు. అనంతరం బయటకు వచ్చిన విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి నేతలపై ప్రజలు ఏమనుకుంటున్నారో.. తానూ అదే అన్నానని సమర్థించుకున్నారు.