సిఎం రమేష్‌కు నోటీసులు

Apr 7,2024 22:40 #CM RAMESH, #notices

ప్రజాశక్తి – చోడవరం (అనకాపల్లి):తమ విధులకు ఆటంకం కలిగించారంటూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ (డిఆర్‌ఐ) అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిజెపి అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం అభ్యర్థి సిఎం రమేష్‌కు పోలీసులు శనివారం రాత్రి 41ఎ నోటీసులు అందజేశారు. ఈ నెల 9న చోడవరం పోలీస్‌స్టేషన్‌లో జరగబోయే విచారణకు విధిగా హాజరు కావాలని వాటిలో పేర్కొన్నారు. ఈ నెల 4న చోడవరం మండలంలోని గాంధీ గ్రామంలో ఉన్న బుచ్చిబాబు ట్రేడర్స్‌ టైల్స్‌ దుకాణంపై డిఆర్‌ఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్న సమయంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కెఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, బిజెపి ఎంపి అభ్యర్థి సిఎం రమేష్‌ హడావుడి చేసి అధికారుల ఫైల్స్‌ను లాక్కున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారుల ఫిర్యాదు మేరకు సిఎం రమేష్‌కు నోటీసులు అందజేసినట్టు సిఐ బి శ్రీనివాసరావు తెలిపారు.

➡️