హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. దీంట్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని ఈడీ పేర్కొంది. అయితే, కవిత విచారణకు వెళ్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. గతేడాది మార్చిలో కవితను ఈడీ పలుమార్లు విచారించింది. కాగా, ఈడీ నోటీసులపై ఇప్పటికే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు.. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్కు ఇప్పటికి నాలుగుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చిన ఆయన హాజరుకాని విషయం తెలిసిందే.