తిరుమలలో భక్తుల రద్దీ

Mar 24,2024 22:05 #tirumala tirupathi temple, #ttd

-వరుస సెలవులతో శ్రీవారి దర్శనానికి 24 గంటలు
ప్రజాశక్తి- తిరుమల:వరుస సెలవు దినాలు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం సందర్శకుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టిటిడి పేర్కొంది. అన్ని కంపార్టుమెంట్లలో నిండిపోయి ఆళ్వార్‌ ట్యాంకు అతిథి గృహం వరకు సందర్శకులు వేచి ఉన్నారు. శనివారం 72,986 మంది శ్రీవారిని సందర్శించుకున్నారు. 33,482 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో శనివారం రూ.2.97 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు.

➡️