ప్రాణాలు తీసిన ఓవర్ టేక్

Mar 8,2024 16:12 #Bapatla District, #road accident

ప్రజాశక్తి-దాచేపల్లి : పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలోని నాగార్జున సిమెంట్స్ ఫ్యాక్టరీ వైపు వెళ్తున్న లారీ కింద తెలంగాణ వైపు వెళ్తున్న బైక్ పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి, లారీ టైర్ల కింద బైక్ వెళ్ళిపోయింది. లారీ వెనుక టైర్ల కింద బైక్ పై ఉన్న ఇద్దరు పడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరూ కార్పెంటర్లగా పనిచేస్తున్నారని సమాచారం. మృతి చెందిన వారు మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన వారిని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️